33.2 C
Hyderabad
April 26, 2024 01: 52 AM
Slider కరీంనగర్

ఎక్సైజ్ శాఖ అధికారులపై ఏసీబీ దాడులు

#Exice Police

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ శాఖలో ఏసీబీ దాడులు నిర్వహించారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామం లోని లక్ష్మీనరసింహస్వామి వైన్స్ సమీపంలో దాబా అనుమతి కోసం ఎక్సైజ్ ఎస్సై సుస్మిత నిర్వాహకులను రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో నిర్వాహకులు కవ్వంపల్లి సురేష్, తిరుపతి, సంజీవ్ లు ఏసీబీని ఆశ్రయించారు.

దీంతో నేడు సిరిసిల్ల శివారులోని ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో కానిస్టేబుల్ రాజు రూ. 20 వేలు లంచం డబ్బులు తీసుకున్నాడు. ఏసీబీ అధికారులను గమనించిన కానిస్టేబుల్ రాజు పరారయ్యాడు. దీంతో ఎస్సై సుస్మిత, కానిస్టేబుల్ రాజులపై కేసు నమోదు చేశామని, కానిస్టేబుల్ రాజు పరారీలో ఉన్నాడని ఏసీబీ డిఎస్పి భద్రయ్య మీడియాకు వెల్లడించారు.

Related posts

మెర్సీకిల్లింగ్: రైతులు – రాజధాని – రాజకీయ పార్టీలు

Satyam NEWS

ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో రషీద్ ఖాన్

Satyam NEWS

రామతీర్థం నీలాచలం కేసులో ముగ్గురి అరెస్టు

Satyam NEWS

Leave a Comment