బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాలలో పోస్టింగులు తెచ్చుకోవడం…. లంచాలు తీసుకోవడం… ఇదే పని నడుస్తున్నది. భూముల విలువలు బాగా పెరిగిపోయి, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువ సంఖ్యలో వస్తున్న ప్రాంతం యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు.
మరింకేం ఈ పోస్టులోకి వచ్చిన సబ్ రిజిస్ట్రార్ లంచాలకు మరిగాడు. నేడు అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్, సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఓ వెంచర్ విషయంలో డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు డిమాండ్ చేశాడు సబ్ రిజిస్ట్రార్ దేవానంద్. రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.