37.2 C
Hyderabad
March 29, 2024 19: 59 PM
Slider విజయనగరం

విజయనగరం లో రాత్రి పూట జరిగిన ప్రమాదం.. ఎంతమందంటే…!

#road accident

విజయనగరం జిల్లా కేంద్రంలో.. సీతం కాలేజీ వద్ద  రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఒడిషాకు చెందిన బోర్ వెల్ లారీ ఐదుగురు తో వెళుతుండగా.. సీతం కాలేజీ పక్కనే నీలగిరి చెట్టు ను ఢోకొంది.

అప్పటికే కొద్ది సేపటి క్రితం… నగరంలో ని ఎస్పీ రాజకుమారీ.. కరోనా నివారణపై మాస్క్ అవసరాన్ని గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించారు.

ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే ఎస్పీ వెళ్లిపోగానే ట్రాఫిక్ డీఎస్పీ ,సీఐ వెళ్లిపోయే సందర్భంలో అకస్మాత్తుగా ఫోన్ రావడంతో వెనువెంటనే సీఐ ఎర్రం నాయుడిని ఘటనా స్థలానికి వెళ్లమని.. డీఎస్పీ మోహనరావు ఆదేశించారు.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ..ప్రమాదపు వివరాలు తెలుసుకున్నారు. స్పాట్ లో ఒకరు మృతి చెందగా ముగ్గురు హాస్పిటల్ పాలైనట్టు సీఐ ఎర్రంనాయుడులు తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మాట వినని అధికారులు, రాజకీయ నాయకులపై వేటు?

Satyam NEWS

మూత్ర పిండ క్యాన్సర్ కు మమత లో అరుదైన చికిత్స

Satyam NEWS

ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయం

Satyam NEWS

Leave a Comment