విజయనగరం జిల్లా కేంద్రంలో.. సీతం కాలేజీ వద్ద రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఒడిషాకు చెందిన బోర్ వెల్ లారీ ఐదుగురు తో వెళుతుండగా.. సీతం కాలేజీ పక్కనే నీలగిరి చెట్టు ను ఢోకొంది.
అప్పటికే కొద్ది సేపటి క్రితం… నగరంలో ని ఎస్పీ రాజకుమారీ.. కరోనా నివారణపై మాస్క్ అవసరాన్ని గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే ఎస్పీ వెళ్లిపోగానే ట్రాఫిక్ డీఎస్పీ ,సీఐ వెళ్లిపోయే సందర్భంలో అకస్మాత్తుగా ఫోన్ రావడంతో వెనువెంటనే సీఐ ఎర్రం నాయుడిని ఘటనా స్థలానికి వెళ్లమని.. డీఎస్పీ మోహనరావు ఆదేశించారు.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ..ప్రమాదపు వివరాలు తెలుసుకున్నారు. స్పాట్ లో ఒకరు మృతి చెందగా ముగ్గురు హాస్పిటల్ పాలైనట్టు సీఐ ఎర్రంనాయుడులు తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.