రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్, కందవాడ స్టేజిల మధ్య ఇన్నోవా కారు బోర్ లారీ ఎదురుఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్నఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. జేసీబీ సహాయంతో కారులో ఉన్నవారిని పోలీసులు వెలికితీశారు. వీరంతా హైదరాబాద్ కు చెందిన వారుగా పోలీసులుగుర్తించారు.
చేవెళ్ల లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా హైదరాబాద్ నగరంలోని తాడ్బంద్ కు చెందిన వారు. ఇన్నోవా కారులో11 మంది ఉండగా ఇందులో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు ప్రాణాలతో బయట పడగా మిగతా వారి పరిస్థితి సీరియస్గానే ఉన్నట్లు సమాచారం. వీరంతా కర్ణాటకలో గురుమిట్కల్ కు వెళ్తుండగా ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఆసిఫ్ ఖాన్ (50), మహేష్ షనియా(18), నజియ బేగం (45), నజియా భాను (36), హర్ష (28), హర్ష భాను (6)లు ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.