36.2 C
Hyderabad
April 16, 2024 20: 35 PM
Slider ముఖ్యంశాలు

అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు

#Achemnaidu

టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.

కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లకూడదని అచ్చెన్నకు హైకోర్టు షరతు విధించింది. ఇటీవలే అచ్చెన్నాయుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

గత 70 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, అచ్చెన్నకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి.

Related posts

ఉప్పల్ నియోజకవర్గ TUWJ నూతన కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

రామాలయం మూసివేత

Murali Krishna

సంపూర్ణ ఆరోగ్యానికి తొలి వెయ్యి రోజుల స‌మ‌తుల ఆహార‌మే కీల‌కం

Satyam NEWS

Leave a Comment