ఈఎస్ఐ కేసులో అరెస్టు అయి ఇటీవలె బెయిల్ పై విడుదల అయిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
కుటుంబ సమేతంగా అచ్చెన్నాయుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇటీవలె ఆయన కరోనా బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇలా చాలా రోజుల తరువాత బయటకు వచ్చిన అచ్చెన్ననేడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు.