తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లో పార్టీ ని నడిచే సత్త కనిపిస్తోందని..టీడీపీ నేతలు ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, విజ్జపు ప్రసాద్ లు అన్నారు. విజయనగరం పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 52వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ మేరకు అశోక్ బంగ్లాలో ఆ పార్టీ నేతలు కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ విజయనగరం అధ్యక్షుడు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ మాట్లాడుతూ… అయిదుపదుల వయస్సు లో పార్టీ రాష్ట్ర బాధ్యత ను తన భుజస్కంధాలపై వేసుకుని అలుపెరగకుండా ఉన్న అచ్చెన్నాయుడు..అందరికీ ఆదర్శమేనని అన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఐవీపీ రాజు మాట్లాడుతూ… కిందపడి లేచిన వ్యక్తి… ఆధ్వర్యంలో ప్రస్తుతం పార్టీ నడుస్తోందని… ఎర్రంనాయుడు..రామ్మోహన్ నాయుడు వారసత్వం పునికి పుచ్చుకుని… పార్టీ ముందు తీసుకెళుతున్న మహోన్నత మైన వ్యక్తి అచ్చెన్నాయుడు అని కొనియాడారు.