జైల్ లో ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా వైరస్ సోకింది. నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో అచ్చెన్నకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంతో ఈ రోజు కరోనా పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.
టీడీపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పాజిటివ్ రావడంతో కుటుంబీకులు, అభిమానులు, కార్యకర్తలు, అనుచరుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది.
జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అచ్చెన్న సురక్షితంగా ఉండాల్సింది పోయి ఈ విధంగా కరోనాకు గురికావడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
హెమరాయిడ్స్ ఆపరేషన్ చేయించుకున్న ఆయనను ఏపి పోలీసులు అరెస్టు చేసి నిర్దాక్షిణ్యంగా కారులో గంటల కొద్ది తిప్పిన విషయం తెలిసిందే.