ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయుల బదిలీ లు, పదోన్నతుల లో ఓవో నెం 3 అమలును నిర్లక్ష్యం చేస్తున్న ములుగు జిల్లా DEO పాణి పై చర్యలు తీసుకోవాలని ATF ములుగు జిల్లా డిమాండ్ చేసింది. ములుగు జిల్లా కేంద్రంలో నేడు ఉపాధ్యాయ సంఘాలతో బదిలీలు, పదోన్నతుల కో ఆర్డినేటింగ్ మీటింగ్ విద్యా శాఖ అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశానికి ములుగు జిల్లా ATF అధ్యక్షులు M సంతోష్ కుమార్ హాజరు అయ్యి సభా అధ్యక్షులు DEO పాణి కి అభ్యంతరాల పై మెమోరాండం ఇవ్వ బోగా ATF అభ్యంతరాల మెమోరాండం ను తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యకంతం చేస్తూ ములుగు జిల్లా DEO పై చర్యలు తీసుకోవాలని ATF డిమాండ్ చేసింది.
ఏజెన్సీ ప్రాంతంలో అన్ని యాజమాన్య లలో జీవో నెం 3 ప్రకారం పదోన్నతులు చేపట్టాలని కోరారు. కామన్ సీనియరీటి రద్దు చేసి ఏజెన్సీ, ప్లేన్ వేరు వేరు గా జాబితాను ప్రకటించాలని, బదిలీ ప్రక్రియ ఏజెన్సీ, ప్లేన్ వేరు వేరు గా చేపట్టాలని కోరారు.