38.2 C
Hyderabad
April 25, 2024 13: 45 PM
Slider హైదరాబాద్

కాచిగూడ డివిజన్ లో మంచినీటి సమస్య వెంటనే పరిష్కరించాలి

#kachiguda

కాచిగూడ డివిజన్ లో మంచినీటి సమస్య వెంటనే పరిష్కరించాలని కార్పొరేటర్ కన్నె ఉమ్మ రమేష్ యాదవ్ వాటర్ వర్క్స జీఎంకు వినతి పత్రం సమర్పించారు. కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నే ఉమారమేష్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు కన్నే రమేష్ యాదవ్ తో కలిసి  కాచిగూడ డివిజన్లోని చప్పల్ బజార్, మణియార్ పట్టి, మోతి మార్కెట్, కుత్బిగూడ, రహ్మత్ బాగ్ తదితర ప్రాంతాలలో లో ప్రెషర్ వల్ల మంచి నీటి సరఫరా సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మణియర్ పట్టి బస్తీలో మంచినీటి సరఫరాను రాత్రి 3 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు సరఫరా అయ్యేల చూడాలని డివిజన్లోని హ్యాండ్ బోర్ లు, మోతిలాల్ నెహ్రూనగర్ లోని పవర్ బోర్డు వెంటనే బాగు చేయాలని కోరుతూ వాటర్ వర్క్స్ జీ.ఎం.సుబ్బారాయుడుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసు, భీమ్ రాజ్, రాజ్ కుమార్, ఆర్.సంతోష్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక గల్లీ లీడర్..

Satyam NEWS

నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభించనున్న చంద్రబాబు

Satyam NEWS

వర్ష ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment