27.7 C
Hyderabad
March 29, 2024 01: 45 AM
Slider నెల్లూరు

ఆదాలకు మద్దతు కోసం గుంపులుగా జనం

#adala

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మద్దతు తెలిపేందుకు జనం గుంపులుగా తరలివస్తున్నారు. సన్మానాలు, సత్కారాలు చేసి సంతోష పడిపోతున్నారు.  ఆదాల నివాసం వీరి కారణంగా కిక్కిరిసి ఉంటోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కీలక నేతలు స్థానికులను అధిక సంఖ్యలో తీసుకువచ్చి మద్దతు తెలుపుతున్నారు.

కల్లూరుపల్లి ప్రాంతానికి చెందిన కాటంరెడ్డి వివేకానంద రెడ్డి దాదాపు వంద మందికి పైగా స్థానికులతో కలిసి వచ్చారు. ఎంపీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డిని పుష్పగుచ్చాలు అందించి, శాలువాలతో సత్కరించారు. అనంతరం విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డిని సత్కరించారు.

ఒకటో డివిజన్ కార్పొరేటర్ నాగరాజు ఆధ్వర్యంలో నారాయణరెడ్డి పేటకు చెందిన చేనేత కార్మికులు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని సత్కరించారు. తమ ప్రాంతంలోని కర్మ క్రతువుల భవనం అసంపూర్తిగా ఉందని, దానికి నిధులు కేటాయించాలని కోరారు. వెంటనే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించి ఎంపీ నిధుల నుంచి 3 లక్షల రూపాయలను కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

Related posts

కొల్లాపూర్ ప్రాంతంలో కరోనా బియ్యం దొంగలు

Satyam NEWS

పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించాలని డీసీకి వినతి

Sub Editor 2

మేనల్లుడితో అక్రమ సంబంధం కారణంగా అత్త హత్య

Satyam NEWS

Leave a Comment