ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి కి ఉడాన్ పథకం కింద కేంద్రం ఎన్ని విమానాలను నడుపుతోందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం లోక్ సభలో ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కొత్త విమానాలు నడుపుతోందని కూడా ప్రశ్నించారు. కొత్త మార్గాల్లో విమానాలు నడిపే ఆలోచన ఏమైనా ఉందా, ఉంటే ఆ వివరాలు తెలపాలని కూడా ప్రశ్నించారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి దీనికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సంస్థ ద్వారా ఉడాన్ పథకం కింద నాలుగో విడత వేలం నిర్వహించిందని పేర్కొన్నారు.
తిరుపతికి కొలహపూర్, హుబ్లీ, బెల్గాం, కలబుర్గి నుంచి విమానాలు నడుపుతున్నట్టు తెలిపారు. అలాగే కర్నూల్ నుంచి వైజాగ్, బెంగుళూరు నుంచి చెన్నై కి విమానాలు నడుస్తున్నాయని మాత్రమే పేర్కొన్నారు.