సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ సంజీవరెడ్డి శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని 3వ,వార్డులో హరితహారం కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. మూడో వార్డు ఎన్జీవోస్ కాలనీలో ఏర్పాటుచేసిన హరితవనం తనిఖీ చేసి సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ హరిత హారంలో నాటిన మొక్కలకి సపోర్టుగా కర్రలను ఏర్పాటుచేసి ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం చాలా బాగుంది అన్నారు.
హరిత వనంలో వార్డుకి 10,000 మొక్కలు నాటేలా ఏర్పాటు చేసుకోవాలని, వాటిని సంరక్షించుకోవాలి అని ఆయన సూచించారు. వార్డులో ఖాళీ స్థలాలు మరియు రోడ్డు ఇరుపక్కల కూడా మొక్కలు నాటేలా ఏర్పాటు చేసుకోవాలని, కమిషనరు నాగిరెడ్డికి మరియు వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డికి సూచించారు. అడిషనల్ కలెక్టర్ సంజీవ రెడ్డి వెంట ఆర్డీవో వెంకట రెడ్డి, ఎమ్మార్వో జయ శ్రీ, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.