ఇప్పటికే పని భారంతో ఇబ్బంది పడుతున్న పంచాయతి కార్యదర్శులకు మరో ప్రధాన భాధ్యతను అప్పగించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో కార్యదర్షులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ఆయా గ్రామాలలోని పాఠశాలలు, అంగన్వాడీలు, కమ్యూనిటీ హళ్ళు, హెల్త్ సెంటర్ లలో శానిటేషన్ బాధ్యతలను పంచాయతీ సెక్రటరీలకు అప్పగిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై కార్యదర్శులు మండిపడుతున్నారు. ఇప్పటికే పని ఒత్తడితో సతమతమవుతున్నామని, కొత్త బాధ్యతలేందంటూ ఫైర్ అవుతున్నారు. గతంలో సర్కార్ బడుల్లో క్లీనింగ్ పనులు చేసేందుకు స్కావెంజర్లు ఉండేవారు. వారికి నెలకు రూ.2,500 జీతం ఇచ్చేవారు. అయితే స్కావెంజర్లను సర్కార్ తొలగించింది. ఇప్పుడు తాజాగా క్లీనింగ్ బాధ్యతలను సెక్రటరీలకు అప్పగించింది. నిధులు ఇవ్వకుండ యెవరితో క్లీనింగ్ చేయించాలని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఆయా గ్రామాలలో యే పని ఐనా కార్యదర్శులదే ననే వైఖరితో వ్యవహరిస్తున్నది .
previous post
next post