38.2 C
Hyderabad
April 25, 2024 14: 06 PM
Slider కరీంనగర్

ఎమ్మెస్సార్ మృతి పట్ల ఆది శ్రీనివాస్ సంతాపం

#AdiSrinivas

కాంగ్రెస్​ సీనియర్​ నేత ఎమ్మెస్సార్​ మరణం పట్ల కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. ఏ విషయానైనా నిర్మొహమాటంగా, బాహాటంగా చెప్పే శైలి ఎమ్మెస్సార్‌కే సొంతమన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడని ఆది శ్రీనివాస్  కొనియాడారు. ఆయన మరణం కాంగ్రెస్​కు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గా అనేక సేవలందించిన ఎమ్మెస్సార్ మరణం కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్రానికి తీరని లోటుగా భావిస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు.

ఎమ్మెస్సార్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాను శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా పని చేశానని ఆది శ్రీనివాస్ తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి ఆయన ఎంతగానో సహకారం అందించారని ఆది శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. దేవస్థానం అభివృద్ధి కే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలగాలని, ఎమ్మెస్సార్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు.

Related posts

సీఎం జగన్ విజయనగరం పర్యటనకు విస్తృత బందోబస్తు

Satyam NEWS

జీతాలు అందని శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ గార్డులు

Satyam NEWS

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో డిఎంఈ బృందం విచారణ

Satyam NEWS

Leave a Comment