ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కాంబ్లీ నాందే వ్ బుధవారం హఠాన్మరణం పొందారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల గుంజాల గ్రామానికి చెందిన నాందేవ్ కు మంగళవారం రాత్రి గుండె పోటు రావడం తో హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. నాందేవ్ విద్యుత్ కాంట్రాక్టర్ గా జిల్లా ప్రజలకు ఆయన సుపరిచితులు.
ఆయన మృతి పట్ల మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే లు తమ సంతాపం వ్యక్తం చేశారు.