35.2 C
Hyderabad
April 20, 2024 16: 35 PM
Slider ఆదిలాబాద్

బైంసా అల్లర్ల పై పార్లమెంటులో గళం విప్పిన ఎంపీ సోయం

#SoyamBapurao

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బైంసా పట్టణం లో తరచూ జరుగుతున్న మత ఘర్షణల కేసులో హిందువుల పై దాడులు జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఈ వరుస ఘటనలపై సిబిఐతో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ సోయం బాపురావు కోరారు.

పార్లమెంట్లో జీరో అవర్ సందర్భంగా సోయం బాపురావు బైంసా అల్లర్ల వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఎంఐఎం పార్టీ నేతలు గుండాయిజం ప్రదర్శిస్తున్నారని వారికి భయపడి టిఆర్ఎస్ ప్రభుత్వం  నిందితులపై సరైన విధంగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

ప్రతిసారీ జరుగుతున్న దాడుల్లో హిందువులు తీవ్రంగా గాయపడుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాళ్లు రువ్వడం, కత్తులు, మారణాయుధాలతో  దాడులు విధ్వంసం సృష్టిస్తూ అమాయకులపై ప్రతాపం చూపుతున్నారని అన్నారు.

బైంసా పట్టణం లో హిందువులు భయభ్రాంతులకు గురవుతున్నారని  వారికి రక్షణ లేకుండా పోతుందని సోయం బాపురావు అన్నారు.ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సిబిసిఐడి చేత విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

చిరుధాన్యాల ఉపయోగంతో ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేయాలి

Bhavani

సినీ కార్మికులకు అండగా నేనున్నాను

Bhavani

Leave a Comment