ప్రకృతి సహజ సిద్ధమైన ఆదిలాబాద్ అడవుల జిల్లా లో పర్యాటక రంగ అభివృద్ధికి దృష్టిసారించాలని పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కోరారు.
కేంద్ర క్యాబినెట్ లో పదోన్నతి ప్రమోషన్ పొందిన కిషన్ రెడ్డి గారిని గురువారం న్యూఢిల్లీలో ఎంపీ సోయం బాపురావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. సహాయ మంత్రి నుండి క్యాబినెట్ మంత్రిగా పదవి సాధించడం పట్ల ఎంపీ హర్షం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కుంటాల వచ్చారా గుండాల జలపాతాల అభివృద్ధికి ఏజెన్సీలోని జలపాతాల తోపాటు కొమరం భీమ్ జోడేఘాట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే అదిలాబాద్ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు.
అదేవిధంగా సాంస్కృతిక శాఖ తరపున ఆదివాసుల సంస్కృతి కళా రంగాలకు ఆడిటోరియంల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. త్వరలోనే జిల్లాలో పర్యటించారు సిందిగా కోరగా ఎందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సోయం బాపురావు వివరించారు.