ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపూరావ్ ఇవాళ కోవిడ్ టీకా వేయించుకున్నారు. ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రి లో ఎంపి సోయం బాపు రావ్ తొలి డోసు కోవిడ్ షీల్డ్ టీకా తీసుకున్నారు.
అనంతరం ప్రజలంతా ముందుకు వచ్చి ఈ టీకాని వేయించుకోవాలని టికా వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోడీ పేద ధనిక అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరికీ టీకా అందించే ఉద్దేశంతో ఉచిత టీకా ని అందిస్తున్నారని ఈ విషయంలో మోది ని యావత్తు ప్రపంచమే మెచ్చుకుంటుందని ఎంపి అన్నారు.