ఆదిలాబాద్ రూరల్ మండలం జడ్పిటిసి ఉప ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ క్యాండెట్ ను ఖరారు చేసింది. దివంగత జడ్పీ వైస్ చైర్మన్ రెండో తనయుడు నరేష్ కుమార్ కు టికెట్ ను ఖరారు చేసింది.
గురువారం స్థానిక టిటిడి సి కాన్ఫరెన్స్ హాల్లో రూరల్ మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు , ఇతర మండల స్థాయి నేతలతో సమావేశమైన ఎమ్మెల్యే జోగు రామన్న నరేష్ కుమార్ కు టికెట్ ను కన్ఫర్మ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.
జడ్పీ వైస్ చైర్మన్ గా ఉన్న అరె రాజన్న ఈ ఏడాది సెప్టంబరు 6 వ తేదీన కరోనా తో మృతి చెందారు. దీంతో ఈ స్థా నానికి ఉప ఎన్నిక జరుగ నుంది. ఉప ఎన్నిక లో పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపినప్పటికీ తనకు అత్యంత సన్నిహితుడైన రాజన్న కుటుంబానికి ఎమ్మెల్యే ప్రాధాన్యతనిచ్చారు.
ఎలాగైనా ఈ స్థానాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని వ్యూహంతో నరేష్ ను బరిలోకి దింపుతున్నారు. త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థి ని ఖరారు చేసిన టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది.