తండ్రి అధికారంలో ఉన్నప్పుడే జగన్ కు అక్రమంగా 42 వేల కోట్లు సంపాదించారని బిజెపి నాయకుడు ఆదినారాయణ రెడ్డి అన్నారు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో ఆయన ప్రచారం చేశారు. ధనార్జనే ధ్యేయంగా జగన్ పాలన సాగుతోందని ఆయన అన్నారు. తమకు ఓటు వేయకపోతే పథకాలు రాకుండా చేస్తామని ఓటర్లను వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ వారిని ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నామని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసే కార్యక్రమాలు ప్రజలు తెలుసుకోవాలని ఆయన కోరారు. మోడీ వర్సెస్ కేడీల మధ్య ఉప ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.