28.7 C
Hyderabad
April 20, 2024 08: 52 AM
Slider విజయనగరం

పేద విద్యార్ధుల సమక్షంలో టీడీపీ నేత ఆదితీ గజపతిరాజు బర్త్ డే

#aditigajapatiraju

కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె, విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పూసపాటి అదితి గజపతి రాజు పుట్టినరోజును పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్టీ కుటుంబసభ్యులు మధ్య నిర్వహించుకున్నారు.  ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, సునీలా గజపతి రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డెఫ్ అండ్ డంబ్ పాఠశాల విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. సదరు పాఠశాల విద్యార్థులను ఒక ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా  పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబం తరపున ఇద్దరిని,  పార్టీ నాయకులు ప్రసాదుల లక్ష్మి వరప్రసాద్, బొద్దుల నర్సింగరావు, కంది మురళీనాయుడు, గంటా పోలినాయుడు, రాజేష్ బాబు కలిసి  5 గురిని దత్తత తీసుకున్నారు. దత్తత నిమిత్తం మొత్తం  42,000లు విరాళం ఇచ్చి ఆదర్శంగా నిలిచారు.

టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వేడుకలు

టీడీపీ పార్లమెంట్ ఇంచార్జ్ ఆదితీ గజపతిరాజు పుట్టినరోజు ను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. తన తండ్రి అయిన కేంద్ర మాజీ అశోక్ ఆధ్వర్యంలో అదీ పేద విద్యార్థుల నడుము కేక్ కట్ చేసారు కూడా. ఇదిలా ఉంటే టీడీపీ యువ సంఘం అయిన టీఎన్ఎస్ఎఫ్ కూడా ఆదితీ గజపతిరాజు జన్మదినం సందర్భంగా పేద విద్యార్థులకు తినుబండారాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ మేరకు విజయనగరం పార్లమెంట్  టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు బెవర భరత్,    తెలుగు యువత నేతలు రాయపాటి సంతోష్,  కోదండరాం, రాజేష్, హర్ష రాజు, శ్రీను, ఇమ్రాన్, నరేష్ తదితరులు కలిసి  సారధి వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉంటున్న  వికలాంగ విద్యార్థుల మధ్య కేక్ కటింగ్  చేసి,  పండ్లు పంపిణీ చేశారు.

Related posts

ఘనంగా ‘శరపంజరం’ ప్రీ రిలీజ్‌ వేడుక

Satyam NEWS

ఆకలి దేవోభవ

Satyam NEWS

ఔట్ డేటెడ్ పాలిటిక్స్ తో చంద్రబాబు కుప్పంలో కుదేలు

Satyam NEWS

Leave a Comment