28.7 C
Hyderabad
April 20, 2024 09: 02 AM
Slider ఆదిలాబాద్

కిడ్నీలు పాడైన యువతికి సాయం చేసిన సొసైటీ

#AdityaSociety

రెండు కిడ్నీలు పాడైపోయిన ఒక యువతి వైద్య సహాయం కోసం ఎదురుచూస్తున్నది. నిర్మల్ జిల్లా జైనథ్ మండలం కంఠ గ్రామానికి చెందిన రౌత్ శిల్పకు తన వంతు సాయం చేసేందుకు ఆదిత్య ఖండేశ్కర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిత్య ముందుకు వచ్చారు.

నిర్మల్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రౌత్ శిల్పను ఆదిత్య ఖండేశ్కేర్ నేడు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు 25 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు.

ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన శిల్ప అనారోగ్యం కారణంగా రెండు కిడ్నీలు చెడిపోయాయని మనసున్న దాతలు స్పందించి ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఆపరేషన్ కు 20 లక్షలు ఖర్చు అవుతున్నదని ఆయన తెలిపారు.

దాతలు స్పందిస్తే ఆమెకు పునర్జన్మ ఇచ్చినట్లు అవుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఖండేశ్కేర్ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ గుండా వార్, జాయింట్ సెక్రెటరీ జవజి వంశీ, కిషోర్ రెడ్డి,అభిషేక్, సామ రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రతి పల్లెలో ఆగే ఎక్స్ ప్రెస్ బస్సులను ఎక్కడైనా చూశారా?

Satyam NEWS

అక్కడ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న విధేంటో తెలిస్తే..అవాక్కే…

Satyam NEWS

Free Sample Lowing Blood Pressure Naturally Will High Blood Pressure Medicine Help Partially Clogged Arteries

Bhavani

Leave a Comment