ఏపీ నూతన సీఎస్గా ఆదిత్యనాథ్దాస్ బాధ్యతల స్వీకరించారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని నుంచి ఆదిత్యనాథ్దాస్ సచివాలయం మొదటి బ్లాక్లో బాధ్యతలు స్వీకరించారు.
ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్ దాస్కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. సీఎస్గా తనకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆదిత్యానాథ్ దాస్ అన్నారు.
అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. అన్ని సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని ఆయన తెలిపారు.
ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకే అధికారులంతా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.