ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన అడ్వకేట్ ధూడపాక సంజీవ ఈ రోజు నల్గొండలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ పట్ట భద్రుల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
దూడ పాక సంజీవ ఎంబీఏ, ఎల్ ఎల్ బి, ఎల్ ఎల్ ఎం పూర్తి చేసుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా లో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.
దీంతోపాటు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ వస్తున్నారు. గతంలో నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నో సేవా కార్యక్రమాలలో పని చేసినారు.
దూడపా క సంజీవ కు నేస్తం ఫౌండేషన్ మద్దతు తెలుపుతున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు నక్క రాజు తెలిపారు.
ఈ రోజు ఎం ఎల్ సి అభ్యర్థి సంజీవ వెంట నక్క రాజు తో పాటు సంస్థ సభ్యులు జన్నూ భరత్ ఉన్నారు.