బాంబే హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియమితులై శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు హైకోర్టు సీనియర్ న్యాయవాది, దక్షిణ భారత అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్ సాధన సమితి అధ్యక్షుడు సుధా నాగేందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
హైకోర్టులో జడ్జిల సంఖ్య 19 పెరగడం శుభసూచకం అన్నారు. కరోనా తర్వాత ఫిజికల్ కోర్టులు ప్రారంభమవడం హర్షణీయం అన్నారు. దీని ద్వారా సత్వర న్యాయం జరుగే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా అడ్వకేట్స్ నుంచి కూడా హైకోర్టు జడ్జిలను వెంటనే నియమించాలన్నారు. న్యాయవాదులు పి.సతీష్, రాజేష్, అంబేద్కర్, మణీ, జ్యోతి తదితరులు ఉన్నారు.