రెండు మేజర్ ఆపరేషన్ల తరువాత చిత్తూరు జిల్లా నగరి ఎమ్మేల్యే ఆర్కే రోజా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి.
ఆపరేషన్లు జరిగిన నేపథ్యంలో రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఈ విషయాన్ని రోజా భర్త సెల్వమణి తెలిపారు.
రోజాకు గత ఏడాదే ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉండగా, కరోనా విజృంభణ నేపథ్యంలో వాయిదా పడిందని చెప్పారు.
ఈ ఏడాది జనవరిలో ఆపరేషన్ చేయించుకుందామనుకున్నారని, అయితే, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదా వేసుకున్నారని వివరించారు.
ఆమె ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిపారు.
1 comment
Very nice , good information