39.2 C
Hyderabad
April 25, 2024 18: 02 PM
Slider ముఖ్యంశాలు

కేంద్రం అనాలోచిత నిర్ణయం విరమించుకోవాలి: సి ఐ టి యు

#Roshapathi

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు యువత ఆందోళనలో ఉన్నారని తక్షణమే అగ్నిపథ్ ను రద్దు చేయాలని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సి ఐ టి యు కార్యాలయంలో శుక్రవారం శీతల రోషపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీం ను రద్దు చేయాలని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల ఘటన పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు,అన్ని పార్టీలు ఖండించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అందోళనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణం  చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సి ఐ టి యు కార్యవర్గ సభ్యుడు ఎలక సోమయ్య గౌడ్, కోటేశ్వరరావు,వెంకన్న,రాజు,రాకేష్ ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వార్డుల వారీగా ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం

Satyam NEWS

మళ్లీ మొదలు:విశాఖ అభివృద్ధికి రూ.394 కోట్లు

Satyam NEWS

ఆత్మహత్యలు నిరుద్యోగులకు రాజభోగం కేసిఆర్ కుటుంబానికా?

Satyam NEWS

Leave a Comment