కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నూతనంగా వచ్చిన ట్రాక్టర్లను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే ఎన్డిసిసి బ్యాంకు చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సంయుక్తంగా ఆయా గ్రామాల సర్పంచ్లకు అందజేశారు.
పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని వారు అన్నారు కార్యక్రమంలో వీరితోపాటు ఎంపిపి యశోద నీలు పటేల్, జడ్పిటిసి లక్ష్మీబాయి దాదారావు పటేల్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు డాక్టర్ అంజిరెడ్డి పాల్గొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షులు శివానంద్, తెరాస అధ్యక్షులు బొల్లి గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, జుక్కల్ సర్పంచ్ రాములు. సెట్ ఎన్డిసిసి బ్యాంకు డైరెక్టర్ రామ్ పటేల్ మాజీ జడ్పీటిసి మాధవరావుదేశాయి ఆయా గ్రామాల సర్పంచ్లు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.