33.2 C
Hyderabad
April 26, 2024 02: 41 AM
Slider జాతీయం

ఈడీ విచారణ ఎదుర్కొన్న అహ్మద్ పటేల్

#Ahmad Patel

మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ను ఇన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు విచారణ జరిపింది. స్టెర్లింగ్ బయోటెక్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్ నిందితుడు. ఈ కేసుకు సంబంధించి ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆయన రావడం లేదు.

దాంతో ఈడీ అధికారులు ముందుగా సమాచారం ఇచ్చి ఆయన ఇంటికి వచ్చి విచారణ జరిపారు. ఢిల్లీలోని అహ్మద్‌ పటేల్‌ నివాసంలో ఈడీ అధికారుల విచారణ కొనసాగింది. స్టెర్లింగ్ బయోటెక్ కు సంబంధించి సందేశర గ్రూప్‌ వ్యవహారంలో రూ.5 వేల కోట్ల  కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి ఈడీ విచారణ జరుపుతున్నది. ఈ కేసులో అహ్మద్ పటేల్ సోదరులకు సంబంధం ఉన్నట్లు గుర్తింపు.

Related posts

‘ఊర్వశి ఓటిటి’కి గర్వకారణం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అంకితం!!

Satyam NEWS

అయిదు ల‌క్ష‌లు..కాదు…25 లక్ష‌లు న‌ష్ట‌ప‌రిహరం ఇవ్వాలి

Satyam NEWS

పెంబర్తి వద్ద అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు లారీఢీ

Satyam NEWS

Leave a Comment