మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ను ఇన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు విచారణ జరిపింది. స్టెర్లింగ్ బయోటెక్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్ నిందితుడు. ఈ కేసుకు సంబంధించి ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆయన రావడం లేదు.
దాంతో ఈడీ అధికారులు ముందుగా సమాచారం ఇచ్చి ఆయన ఇంటికి వచ్చి విచారణ జరిపారు. ఢిల్లీలోని అహ్మద్ పటేల్ నివాసంలో ఈడీ అధికారుల విచారణ కొనసాగింది. స్టెర్లింగ్ బయోటెక్ కు సంబంధించి సందేశర గ్రూప్ వ్యవహారంలో రూ.5 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి ఈడీ విచారణ జరుపుతున్నది. ఈ కేసులో అహ్మద్ పటేల్ సోదరులకు సంబంధం ఉన్నట్లు గుర్తింపు.