హర్యానాలోని ఒక ప్రఖ్యాత ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యంత హీనమైన నేరం జరిగింది. మంగళవారం ఇక్కడి ఐసియులో వెంటిలేటర్పై ఉన్న ఎయిర్ హోస్టెస్పై సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిదితుడిని గుర్తించడానికి ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 46 ఏళ్ల మహిళ తాను బస చేసిన హోటల్లోని స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టిన తర్వాత అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. ఏప్రిల్ 5న ఆమెను గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, ఈ ఆదివారం ఆమెను డిశ్చార్జ్ చేశారు.
“ఏప్రిల్ 6న, నేను వెంటిలేటర్పై ఉన్నప్పుడు కొంతమంది ఆసుపత్రి సిబ్బంది నాపై లైంగిక దాడి చేశారు” అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. డిశ్చార్జ్ అయిన తర్వాత, ఆమె తన భర్తకు ఈ సంఘటన గురించి చెప్పి, ఆపై పోలీసులను సంప్రదించామని ఎయిర్ హోస్టెస్ తెలిపారు. ఫిర్యాదు తర్వాత, సోమవారం సదర్ పోలీస్ స్టేషన్లో ఆసుపత్రిలోని గుర్తు తెలియని సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. “బాధితురాలి వాంగ్మూలాన్ని కోర్టులో మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసు బృందం పరిశీలిస్తోంది. నిందితులను త్వరలో గుర్తిస్తుంది” అని గురుగ్రామ్ పోలీసు ప్రతినిధి తెలిపారు. దర్యాప్తు జరుగుతోంది నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ప్రతినిధి తెలిపారు.