కరోనా ప్రభావంతో మూతపడిపోయిన దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలలో ప్రస్తుతం విమానాలు ఎగరడం లేదు. ఈనెల 25 నుండి దేశీయ విమాన సర్వీసులు పున: ప్రారంభం చేయాలని కేంద్ర భావించింది. ఈ మేరకు అన్ని ఎయిర్ లైన్స్,ఎయిర్ పోర్టు లకు పౌరవిమాన శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అంతే కాకుండా కరోనా వైరస్ నేపథ్యంలో విమాన యానానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. భౌతిక దూరం పాటిస్తూ విమానయానం చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా శరీర ఉష్ణోగ్రత ఎక్కువ వుంటే విమానం ఎక్కనివ్వరు.