35.2 C
Hyderabad
April 20, 2024 18: 50 PM
Slider సినిమా

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

#Aiswarya Rajesh

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మాదాపూర్ లో ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు చాలా ముఖ్యమని రోజురోజుకు పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోతుందని కాబట్టి అందరం బాధ్యతగా మొక్కలు నాటి మనం పీల్చుకునే ఆక్సిజన్ ను మనమే పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ చాలెంజ్ అదేవిధంగా కొనసాగాలని తన అభిమానులను, స్నేహితులను మొక్కలు నాటి వాటిని సోషల్ మీడియాలో పెట్టాలని  దాన్ని తాను షేర్  చేస్తానని పిలుపునిచ్చారు.

Related posts

ఆడపిల్లల జనాభా తగ్గకుండా చూడడం మన బాధ్యత

Satyam NEWS

హుజూర్ నగర్ టిఆర్ఎస్ అభ్యర్ధికి పొంచిఉన్న గండం

Satyam NEWS

కొల్లాపూర్ రాజకీయ చాణక్యుడు ఇక లేరు

Satyam NEWS

Leave a Comment