24.7 C
Hyderabad
March 29, 2024 07: 47 AM
Slider కడప

సివిల్ సప్లై గోడౌవున్ వద్ద ఏఐటీయూసీ నిరసన ప్రదర్శన

#AITUCKadapa

హమాలీలకు పెంచిన జీతాలు, పీఎఫ్ చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా రాజంపేట సివిల్ సప్లై గోడౌవున్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు యం.యస్.రాయుడు అధ్యక్షత వహించారు. రాజంపేట సీపీఐ ఏరియా కార్యదర్శి మహేష్ సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా జిల్లా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్య క్షుడు యం.యస్. రాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ పిలుపు మేరకు రెండో రోజు ఈ నిరసన వ్యక్తం చేసినట్టు తెలిపారు.

2019 ఒప్పందం ప్రకారం సివిల్ సప్లై గోడౌవున్ హమాలీలకు పెంచిన జీతం ఇంతవరకు ఇవ్వలేదని, పీఎఫ్ చెల్లించ లేదని ఉద్యోగ భద్రత కూడా లేదని ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

ఉక్రెయిన్ రాజధానిని సందర్శించిన రిషి సునక్

Satyam NEWS

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Satyam NEWS

కోటప్పకొండ తిరుణాళ్లకు పోలీసు ఏర్పాట్లు పూర్తి

Bhavani

Leave a Comment