32.2 C
Hyderabad
April 20, 2024 20: 17 PM
Slider జాతీయం

పదవి నుంచి వైదొలగిన అజిత్ పవార్

23Ajit-pawar

మహారాష్ట్ర అసెంబ్లీలో రేపే (బుధవారం) బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బిజెపి శిబిరంలో తీవ్ర ప్రకంపనలు రేగాయి. దీన్ని ఖరారు చేస్తూ ఉప ముఖ్యమంత్రి, ఎన్ సి పి బహిష్క్రత నేత అజిత్ పవర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ నివాసంలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశమైంది. ఈ భేటీ అనంతరం బీజేపీ తన ఎమ్మెల్యేలకు విప్‌ జారిచేసింది. రేపటి బలపరీక్షలో విజయం సాధిస్తామని బీజేపీ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. అంతకుముందు ఫడ్నవిస్‌తో ఎన్సీపీ రెబల్‌ నేత, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ భేటీ అయ్యారు. ముంబైలోని లెమన్‌ ట్రీ హోట్‌లో శివసేన నేతలు, మరియట్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ నేతలు సమావేశమై.. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

Related posts

న్యాయవ్యవస్థపై దాడి ఫ్యాషన్ అయిపోయింది

Satyam NEWS

ఏపి హైకోర్టులో చంద్రబాబుకు నాలుగు వారాల ఊరట

Satyam NEWS

రౌడీ షీటర్ల జీవనశైలిపై ప్రత్యేక నిఘా..!

Satyam NEWS

Leave a Comment