తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కోవిడ్ నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించినందుకు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
లోకేష్ నేడు ముంపు ప్రాంతాలలో పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ట్రాక్టర్ ప్రమాదానికి కారణం కావడంపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ట్రాక్టర్ డ్రైవింగ్ పై అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తూ పది మందిని ట్రాక్టర్లు ఎక్కించుకుని వారి ప్రాణాలకు హాని కలిగే విధంగా లోకేష్ ప్రవర్తించారని కూడా పోలీసులు కేసు పెట్టారు.
రోడ్లపై అవగాహన లేకుండా ట్రాక్టర్ డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేశారు.