శ్రీశైల మహాక్షేత్ర మహాత్మ్యం అందరికీ తెలిసిందే అయినా.. అక్కడి నుంచి 16 నుంచి 17 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న అక్కమహాదేవి గుహాలు మాత్రం చాలామందికి తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులోని భాగంగా శ్రీశైలం నుండి అక్కమహాదేవి గుహల వద్దకు 16వ తేదీ నుండి బోటింగ్ ట్రిప్ మొదలవుతుందని టూరిజం అధికారులు తెలిపారు. ఇందులో పెద్దలకు రూ. 320 చిన్న పిల్లలకు రూ రెండు వందల ఇరవై రూపాయలు టికెట్ ఉంటుందని తెలిపారు. అక్కడికి వెళితే గానీ అక్కమహాదేవి గుహాల విశిష్టతలు తెలుసుకోలేరు, ఆ అనుభూతిని అనుభవించలేరని పలువురు అక్కడికి వెళ్ళిన వారు చెబుతుండడం గమనార్హం.
previous post