36.2 C
Hyderabad
April 25, 2024 21: 56 PM
Slider సినిమా

17న గంటలో కోటి మొక్కలు నాటేందుకు అక్కినేని పిలుపు

#AkkineniNagarjunaNew

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న ఒక గంటలో కోటి మొక్కలు నాటుదామని ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పిలుపు నిచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయాలని నాగార్జున కోరారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మన దేశానికి, ప్రపంచానికి ఎంతో నష్టం జరుగుతుంది.

ఈ మధ్యనే మనం చూశాం ఉత్తరాఖండ్ లో జరిగిన వరదల వల్ల చాలామంది ప్రజలు చనిపోవడం.

కాబట్టి బాధ్యత గల పౌరులుగా వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం మనం కూడా ఏదైనా ఒకటి చేయాలని అనే ఉద్దేశంతో అది కూడా ఒక ప్రత్యేకమైన రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ఈ కార్యక్రమాన్ని  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా అందరం పాల్గొని విజయవంతం చేయాలని అదే ముఖ్యమంత్రి కి  మన తరపున హరిత కానుక  అని నాగార్జున  తెలిపారు.

Related posts

11.18 శాతం పెరిగిన పన్ను వసూళ్లు

Bhavani

అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

Murali Krishna

పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తూడి

Satyam NEWS

Leave a Comment