కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకు పోతున్నదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. నిన్న ఒకే రోజు 730 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా మేలుకొని కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని మల్లు రవి డిమాండ్ చేశారు.
కరోనా మహమ్మారి ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమాత్రం సరిపోవని ఆయన అన్నారు పరిస్థితిని అదుపు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందుకోసమేకి ఈ పరిస్థితి వచ్చిందని డాక్టర్ మల్లు రవి విమర్శించారు ఇప్పటికైనా కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.