తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడుగా నియమితులైన ఆలే భాస్కర్ ను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అంబర్ పేట్ నియోజకవర్గం కమిటీ సభ్యులు సన్మానించారు. ఇప్పటికే భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి సికింద్రాబాద్ ఇన్చార్జిగా ఉన్న ఆలె భాస్కర్ పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
దివంగత బీజేపీ నాయకుడు టైగర్ నరేంద్ర కుమారుడైన ఆలే భాస్కర్ పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొంటారు. పార్టీకి అంకిత భావంతో పని చేస్తున్న ఆలె భాస్కర్ను రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గా నియమితులు కావడం హర్షణీయమని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అంబర్ పేట నియోజకవర్గ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.