హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అందరూ హాజరై విజయవంతం చేయాలని బిజెపి గోల్నాక డివిజన్ శక్తి కేంద్రం ఇంచార్జీలు, బిజెపి గోల్నాక డివిజన్ కన్వీనర్ రవీందర్ గౌడ్ మూల, కోర్ కమిటీ సభ్యులు కోరారు.
బర్కత్ పురా లోని బిజెపి నగర కార్యాలయంలో నేడు జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్.గౌతమరావు పాల్గొన్నారు. ఈనెల 11 నుండి 15 వరకు ఎన్టీఆర్ స్టేడియం ఇందిరాపార్క్ వద్ద జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రికలు అందించి గోల్నాక డివిజన్ ప్రజలందరిని ఆహ్వానించాలని చెప్పారు.
తిరుపతిలో జరిగే పూజలు, సేవలలో మనకు పాల్గొనే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు రోజులలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే చివరి రోజు 15 అక్టోబర్ 2022 శనివారం రోజున సాయంత్రం ఐదు గంటలకు కళ్యాణ మహోత్సవానికి కూడా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు.
సత్యం న్యూస్, అంబర్పేట్