సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే గోపూజ కార్యక్రమం ఏర్పాట్లు గుంటూరు జిల్లా నరసరావుపేటలో చురుకుగా సాగుతున్నాయి.
15వ తేదీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా నరసరావుపేటకు వస్తున్నారు.
నరసరావుపేట లో ఆ రోజు గోపూజ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
స్థల పరిశీలన చేసిన అనంతరం అధికారులకు అవసరమైన సలహాలు అందచేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించారు.