24.7 C
Hyderabad
March 29, 2024 08: 08 AM
Slider గుంటూరు

21న నరసరావుపేటలో మహానాడుకు భారీ ఏర్పాట్లు

#narasaraopet

పల్నాడు జిల్లా నరసరావుపేటలో మినీ మహానాడు నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని ఏర్పాటు చేస్తున్నది. పల్నాడు జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు వస్తున్నందున పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

లక్షన్నర మందికి పైగా జనంతో మహానాడు ఘనంగా నిర్వహిస్తామని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. చెడు పై మంచి విజయం సాదించాలనే దసరా నుంచి నాంది పలుకుతున్నామని ఆయన అన్నారు. ఇస్సాపాలెం వద్ద బైపాస్ లో స్దలం ఎంపిక చేశారు. స్దల పరిశీలన చేసిన టీడీపీ నాయకులు యరపతినేని శ్రీనివాస్ రావు, చదలవాడ అరవింద బాబు నేడు పర్యటించారు.

ఈ నెల 12న పల్నాడు జిల్లా మహానాడు జరగబోతున్నది. ఎప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీ అధికారంలోకి రావడానికి పల్నాటి మహానాడు నాంది పలుకుతుందని టీడీపీ నేతలు యరపతినేని, చదలవాడ కామెంట్ చేశారు. 2013 సెప్టెంబర్ 1 పల్నాడు నుంచే  వస్తున్న మీ కోసం యాత్ర ప్రారంభం అయిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఆనాటి స్పూర్తితో నేడు మాహానాడు కూడా విజయవంతం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు పల్నాటి మహానాడు కీలకం కాబోతుంది. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు చలన గీతం పాడుతాం అని వారన్నారు.

ఎం ఎస్ సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

చెత్త పన్ను వసూలు వెంటనే నిలిపివేయాలి: ఎంఐఎం డిమాండ్

Satyam NEWS

6న విజయనగరం రానున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Satyam NEWS

ఆశా వర్కర్లకు నిత్యావసరాలు, నగదు పంపిణీ

Satyam NEWS

Leave a Comment