కోవిడ్ – 19 వ్యాక్సిన్ ప్రారంభానికి హుజుర్ నగర్ ప్రాంతీయ వైద్యశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్,ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ కరణ్ కుమార్ తెలిపారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 16వ,తేదీ నుండి కరోనా టీకా ప్రారంభం కానున్నట్లు, ప్రభుత్వ ఆదేశానుసారం మొదట వైద్య సిబ్బందికి అందించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, సూపరింటెండెంట్ కరుణాకర్ కుమార్ మాట్లాడుతూ మొదటి డోస్ టీకా వేసుకున్నాక రెండో డోస్ టీకా ఎప్పుడు ఎక్కడ వేసుకోవాలో వారి మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుందని, టీకా వేయించుకునే సమయం దగ్గర పడగానే గుర్తింపు చేసే మెసేజ్ ద్వారా సిబ్బంది ఫోన్ ద్వారా తెలియపరచనున్నారని అన్నారు.
కరోనా వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని, 2 విడతలు వ్యాక్సిన్ పొందడం ద్వారా కరోనా నుండి పూర్తిగా రక్షణ కలుగుతుందని అన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది విజయ రాణి,సుమతి, నూర్జహాన్ బేగం, ఇందిరాల రామకృష్ణ,నాగమణి, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
బాచిమంచి చంద్రశేఖర్, సత్యం న్యూస్, హుజూర్ నగర్