రానున్న మూడు నెలలోనే విశాఖ రాజధాని, భోగాపురం ఏర్ పోర్ట్.. గిరిజన యూనివర్సిటీ పనులు ఈ మూడు ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం లో తన ఇంట్లో కొత్త ఏడాది సందర్భంగా మీడియా తో మాట్లాడారు. ఈ ఏడాది అంతా శుభం జరగాలని కోరుకుంటున్నానని…మా ప్రభుత్వం కూడా అనుకున్న, చేపట్టిన పనులు మరింత వేగవంతం గా పూర్తవ్వాలని పైడితల్లి అమ్మవారి ని కోరుకుంటున్నానని మంత్రి బొత్స… తన భార్య మాజీ ఎంపీ ఝాన్సీతో కలిసి మాట్లాడారు. అనంతరం తన కొడుకు డా.సందీప్ దంపతులచే కొత్త ఏడాది సందర్భంగా తన ఇంట్లో నే మంత్రి బొత్స దంపతులు కేక్ కట్ చేయించారు.