దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్టు బడ్జెట్ వున్న సర్కారు ట్రెజరీ వారు కరెంట్ బిల్లులు మంజూరు చేయకపోవడం తో విద్యుత్ శాఖ అధికారులు ఏటువంటి ముందస్తు నోటీసు లేకుండా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మొదటి, రెండవ క్వాటర్ బడ్జెట్ లో సుమారు 14,000 రూపాయల కరెంట్ బిల్లులు సబ్మిట్ చేసినా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఈ సమస్య ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వుంది.
previous post