రామజన్మభూమి ఆలయ నిర్మాణం లో అందరూ భాగస్వామ్యలు కావాలని ప్రపంచం తలదన్నే ఆలయం కోసం ప్రతి హిందు, కులమతాలకు, పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణమ్మ పిలుపునిచ్చారు.
జోగులంబ గద్వాల జిల్లాలోని ఆతి పురాతనమైన ఆలయంలో వెలసిన స్వయం భూ చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను డి కె అరుణమ్మ ప్రారంభించారు.
అయోధ్యలో రాముని ఆలయం ప్రపంచంలో మర్చిపోని విధంగా నిర్మాణం చేపట్టాలని దీనికి జిల్లా వ్యాప్తంగా భారీగా విరాళాలు సమకూర్చి పంపాలని డి కె అరుణమ్మ సందేశం ఇచ్చారు.
డికె. అరుణమ్మ వెంట RSS సంఘ్ పెద్దలు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, బిజెపి కార్యకర్తలు హిందు బంధువులు భారీ మొత్తంలో తరలివచ్చారు.