32.2 C
Hyderabad
March 28, 2024 22: 20 PM
Slider నల్గొండ

ఈ నెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

#citu

భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ ధర్నాకు కార్మికులు సిద్ధం కావాలని భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం జిల్ల ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శిల్పకళా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో ఆ సంఘ హుజూర్ నగర్ మండల మహాసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సోమయ్య గౌడ్  మాట్లాడుతూ జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ క్లైమ్ ల సమస్య పరిష్కారం కావడం లేదని,కార్మికశాఖ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

వెల్ఫేర్ బోర్డు నిధుల నుండి 55 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, తదితర సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 28న హైదరాబాద్ లోని భవన మరియు ఇతర సంక్షేమ మండలి ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులను కోరారు.ఈ సందర్భంగా 23 మంది కార్యవర్గ సభ్యులతో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని,కార్మికుల హక్కుల సాధనకై ఈ కమిటీ దోహదపడాలని, భవిష్యత్ పోరాటాలకోసం నిరంతరం కృషి చేయాలని కోరారు.

నూతనంగా ఎన్నికైన వారిలో గౌరవ అధ్యక్షుడు ఉప్పతల గోవిందు,అధ్యక్షుడు తమ్మిశెట్టి రాములు,ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తాఫా,కోశాధికారి శీలం వేణు,ఉప్పతల వెంకన్న,ఉప్పతల నరేష్,కడియం మల్లేశ్వరరావు,షేక్ నాగుల్ మీరా,సన్నిధి కృష్ణ,సతీష్,వీర నాగేశ్వరరావు,జాని, అంజి, సహదేవ్,శాంతయ్య,రాజేష్,జెట్టి రాములు, మీనాక్షి,భవాని తదితరులు ఉన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సంపద ఏకీకృతం చేసి దోచుకుంటున్న ముఖ్యమంత్రి

Satyam NEWS

చంద్రయాన్ – 3 ముహూర్తం ఖరారు

Satyam NEWS

అమరావతి హైవే అలైన్ మెంట్ మార్చండి

Murali Krishna

Leave a Comment