సిద్దిపేట జిల్లా (పాత కరీంనగర్ జిల్లా) హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం, పెంచికల్పేట్ గ్రామం పరిధిలో 24వ తేదిన జరిగే ప్రజా అభినందన సభ ను జయప్రదం చేయాలని టీఆర్ఎస్ నాయకులు కోరారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనబోతున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. సభ జరిగే స్థలాన్ని ఎమ్మెల్యేలు సతీష్ బాబు, గువ్వల బాలరాజు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, దూసరి శ్రీనివాస్ గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు పరిశీలించారు.