వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి పురస్కరించుకుని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల సారథ్యంలో తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేయబోతున్న శుభ సందర్భంగా మంగళవారం హుజూర్ నగర్ నియోజకవర్గ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంచార్జ్ ఆదెర్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గడ్డ మీద రాజన్న బిడ్డ వైయస్ షర్మిల హైదరాబాద్ జూబ్లీహిల్స్ జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ నందు ఈ నెల ఎనిమిదో తేదీన గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా నియోజకవర్గం లోని వైయస్ఆర్ అభిమానులు,పార్టీలో చేరబోతున్న కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మెరెడ్డి ఎల్లారెడ్డి, రాజా రమేష్,శాసనాల అంజి నాయుడు, కందుల నరసింహా రెడ్డి,ఆనెపు బ్రహ్మచారి, నున్నా రామారావు,అహ్మద్,యాసిన్, సుతారి శ్రీనివాస్,హాసన్,కృష్ణమూర్తి, సత్యం,అంజి,నరసింహా రెడ్డి,ప్రశాంత్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.